జోన్బృందం, ఫిబ్రవరి 8 : పేదింటి ఆడబిడ్డ పెళ్లికి మేనమామగా వచ్చి తన వంతు బాధ్యతగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా దాదాపుగా 11 లక్షల మందికి లబ్ధి చేకూర్చిన సీఎం కేసీఆర్ మహిళా బాంధవుడని కొనియాడారు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సనత్నగర్ కార్మిక సంక్షేమ కేంద్రం మైదానంలో మైత్రి మహిళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి తలసాని పాల్గొన్నారు.సామాజిక సేవల విభాగంలో విశేష కార్యక్రమాలు చేపట్టిన గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ గుడ్ల ధనలక్ష్మితో పాటు పలువురిని మంత్రి తలసాని కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డితో కలిసి ఘనంగా సన్మానించారు.
మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని నిమ్స్మే డైరెక్టర్ జనరల్ గ్లోరి స్వరూప పిలుపునిచ్చారు. యూసుఫ్గూడ నిమ్స్మేలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్లోరి స్వరూప మాట్లాడుతూ ఆర్థిక స్వావలంబనకు నిమ్స్మే ఒక వారధిగా నిలుస్తుందన్నారు. ఎస్ బ్యాంక్- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీనగర కాలనీ శాఖల సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్యామల కుమారి, ఫెమికేర్ దవాఖాన ఎండీ డాక్టర్ ఫమీదా భాను తదితరులు పాల్గొని మహిళలకున్న శక్తి సామర్థ్యాలతో ఏదైనా సాధించగలరని పేర్కొన్నారు. నిమ్స్మే ఫ్యాకల్టీ డాక్టర్ విజయ సమన్వయకర్తగా వ్యహహరించిన ఈ కార్యక్రమంలో నిమ్స్మే నుంచి నిలదొక్కుకున్న మహిళలు.. శ్రేయాస్ సీఈవో శ్రీలత గౌడ్, చిత్ర గ్లోబల్ సర్వీసెస్ డైరెక్టర్ మంజులను అవార్డులతో ఘనంగా సత్కరించారు. నిమ్స్మేలో శిక్షణపొంది పారిశ్రామిక, వ్యాపార వేత్తలుగా స్థిరపడ్డ మహిళలు తమ ఉత్పత్తులతో నిర్వహించిన స్టాల్స్ను డీజి గ్లోరి స్వరూప ప్రారంభించిన అనంతరం వాటిని సందర్శించి అభినందించారు.