ఉప్పల్జోన్ బృందం, మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినో త్సవాన్ని మంగళవారం ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు బహుమతులు అందజేసి.. చీరలు పంచి.. సన్మానించారు. అదేవిధంగా కార్యాలయాలు, సంస్థలు, పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని.. మహిళల ఓర్పు చాలా గొప్పదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళ, కేసీఆర్ కిట్టు, పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగింద న్నారు. దీంతో పేద మధ్య తరగతి కుటుంబాల ప్రజలు ఎంతో ఆనందం గా ఉన్నారని.. ప్రభుత్వ ఉద్యోగస్తులైన మహిళలకు ప్రసవం టైంలో ఎ క్కువ సెలవులు ప్రకటించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంద న్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, శాంతిసాయిజెన్ శేఖర్, బొంతు శ్రీదేవి, డీసీ అరుణకుమారి, మాజీ కా ర్పొరేటర్ పావనీమణిపాల్రెడ్డి, మహిళా నాయకురాళ్లు, మహిళలు పాల్గొన్నారు.
ప్రభుత్వ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)లో మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ సాహిత్య వేత్త డాక్టర్ అహిల్యా మిశ్రా, ఈసీఐఎల్ పరిశ్రమ చైర్మన్, ఎండీ రేర్ అడ్మిరల్ సంజేయ్ చౌబే, పర్సనల్ డైరెక్టర్ సమీర్ ముఖర్జీ, జనరల్ మేనేజర్ శాంత, అధికారులు విజయేశ్వరి, రాఘవసౌమ్య, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్రెడ్డి, ప్రసాద్తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.