కేపీహెచ్బీ కాలనీ, మార్చి 9 : అసెంబ్లీలో 90 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో జేఎన్టీయూహెచ్లో విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. జేఎన్టీయూహెచ్ టీఆర్ఎస్, జేఏసీ, బంజారా, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో క్యాంపస్ ఆవరణలో భారీ ర్యాలీని నిర్వహించారు. వర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి.. పటాకులు పేల్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శాడగొండ కరుణాకర్రెడ్డి, ఎర్రవల్లి జగన్, రంజిత్కుమార్, రాజ్కుమార్, భానుప్రకాశ్, శ్రీనివాస్ నాయక్, విజయేందర్, ప్రవీణ్, శ్రవణ్, రాహుల్, సిద్దు, శ్రీను, నవీన్, గురుదాస్, నాగచందు, హారిక, సాత్విక, కల్పన, ప్రణీత తదితరులు పాల్గొన్నారు.
కష్టపడితే సర్కారు కొలువు
ఒకేసారి 90 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్ నిరుద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టి నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రకటనతో వేలాది మంది నిరుద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదివితే ప్రభుత్వ కొలువును పొందవచ్చు.
– రాహుల్, జేఎన్టీయూహెచ్
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
సీఎం కేసీఆర్కు నిరుద్యోగులంతా రుణపడి ఉంటారు. బాగా చదువుకునే వారికి ఈ నోటిఫికేషన్తో ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తుండడంతో నిరుద్యోగుల కష్టాలు తీరుతాయి.
– ధరావత్ స్వప్న, జేఎన్టీయూహెచ్
కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చిత్రపటాలకు బుధవారం క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు డీహెచ్ డాక్టర్ శ్రీనివాస్రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం(హెచ్1)రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి సాయిరెడ్డి, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండ శ్రీనివాస్, సభ్యులు శ్రీకాంత్, వెంకన్న, గోపాల్, మల్లారెడ్డి, నరేందర్రెడ్డి, ప్రవీణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– సుల్తాన్బజార్,మార్చి 9