మేడ్చల్జోన్బృందం: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ బుధవారం 80,039 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించ డంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. మండల పరిధిలోని డబిల్పూర్ గ్రామంలో ఉద్యోగాల భర్తీ ప్రకటనతో సంబురాలు నిర్వహించారు. రైల్వేస్టేషన్ ప్రాంతంలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగుల న్యా యం చేసేందుకు సీఎం కేసీఆర్ భారీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఒకేసారి వివిధ ప్రభుత్వ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుండటం సంతోషంగా ఉందన్నా రు. అలాగే 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడం శుభపరిణామమన్నారు. టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్, ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు.
అంతకు ముందు టీఆర్ఎస్ నేత భాగ్యారెడ్డి ఆధ్వర్యంలో డబిల్పూర్ పంచాయతీ కార్యాలయం ఎదుట కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సురేశ్ రెడ్డి, ఎల్లంపేట ఎంపీటీసీ కుమార్యాదవ్, సర్పంచ్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్ జైపాల్ రెడ్డి, సురేందర్ గౌడ్, సుధాకర్, ఫిలిప్స్ పాల్గొన్నారు.టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మండల కార్యదర్శి సుదర్శన్, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయానందారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్ ముదిరాజ్, నాయకులు రాజమల్లారెడ్డి, జగన్రెడ్డి, భాస్కర్ యాదవ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ మేడ్చల్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రామస్వామి ముదిరాజ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్లు దేవా, మహేశ్ గణేశ్, స్వామి యాద వ్, నాయకులు పాల్గొన్నారు. నాగారం మున్సిపాలిటీలో మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన సంబురాల్లో చైర్మన్ చంద్రారెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కీసరలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలరాజు, నాయకులు పాల్గొన్నారు. జవహర్నగర్లో టీఆర్ఎస్ కార్పొరేషన్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన సంబురాల్లో జిల్లా నాయకులు అయ్యప్ప, రాజశేఖర్ పాల్గొన్నారు. శామీర్పేటలోని క్రీడా పాఠశాలలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఓఎస్డీ హరికృష్ణ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు.
కల సాకారమయ్యే సమయం
ఎంతో మంది సుధీర్ఘ కాలంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. 20కి పైగా ప్రభుత్వ విభాగాల్లో 80,039 పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించడం సంతోషంగా ఉంది. నిరుద్యోగుల వారి కలలను నెరవేర్చుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. కష్టపడి చదివి, ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాం.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నాలాంటి నిరుద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీపికబురు అందించింది.80,039 ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షణీయం. ఏటా జాబ్ క్యాలెండర్తో పాటు వయోపరిమితి పెంచడం మాలాంటి వారికి ఎంతో ఊరటనిచ్చింది.