సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తేతెలంగాణ) :విద్యాకుసుమం బషీర్బాగ్లోని నిజాం కాలేజీలో బాలికల వసతి కోసం ఆధునిక హంగులతో కూడిన హాస్టల్ అందుబాటులోకి రానుంది. 2017లోకాలేజీ వార్షికోత్సవానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు హెచ్ఎండీఏ నిధులతో జీ ప్లస్ 3 పద్ధతిన భవన నిర్మాణం పూర్తి అయ్యింది. రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవన సముదాయాన్నిబుధవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 37,163 చదరపు అడుగుల విస్తీర్ణంలో 71 గదులు నిర్మించారు.