మలక్పేట, మార్చి 8: హెచ్ఐవీ బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత సాటి మనుషులుగా మనందరిపై ఉందని లెప్రా సొసైటీ సీఈఓ ప్ర శాంత్ నాయక్, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పార్థసారథిలు అన్నారు. ‘చేయూత డబ్ల్యూసీబీఓ’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గడ్డి అన్నారంలోని రెడ్క్రాస్ దవాఖాన ఆవరణలో నిర్వహించిన మహిళా దినోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆరుగురు హెచ్ఐవీ బాధితులకు రూ.75 వేలు, ముగ్గురికి కుట్టు మిషన్లు, పిల్లల చదువుల కోసం ఇద్దరికి రూ.17 వేలు, ఇటీవల రోడ్డు ప్ర మాదంలో గాయపడిన బాధితులకు రూ.27 వేలు సహా, మొత్తం రూ.1,59000 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా లెప్రా సొసైటీ ప్రతినిధులు మా ట్లాడుతూ హెచ్ఐవీ బాధితులను ప్రేమతో ఆదరించాలని సూచించారు. మనలో ఒకరిగా చూసి, వారికి చేతనైన స హాయాన్ని అందించి ఆదుకోవాలని అన్నారు.
హెచ్ఐవీ బాధితులను సమాజంతోపాటు కుటుంబ సభ్యులు, స్నే హితులు కూడా అంటరాని వారిగా చూస్తుంటారని, అది పద్ధతి కాదన్నారు. హెచ్ఐవీ బాధితులను చేర దీసి వారికి వైద్య సేవలతో పాటు ఆర్థికంగా అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్న ‘చేయూత స్వచ్ఛంద సంస్థ’ ప్రాజెక్టు డైరెక్టర్ కె.లక్ష్మీప్రియ అభినందనీయురాలని ప్రశంసించారు. చేయూత సంస్థకు సహకారం అందించేందుకు తా ము ఎప్పుడూ సిద్ధమేనని వారు పేర్కొన్నా రు. అనంతరం, చేయూత స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె.లక్ష్మీప్రియ మాట్లాడు తూ, హెచ్ఐవీ బాధితులను మనలో ఒకరిగా ఆదరించాలని, చేతనైన ఆర్థిక సహాయాన్ని అందించాలని సూచించారు. ‘చేయూత డబ్ల్యూసీబీఓ’ వెబ్సైట్ను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీ మెడికల్ కళాశాల ఫ్రొఫెసర్ డాక్టర్ జానకి వెల్లంకి, గాంధీ సర్జికల్ యూనిట్ వైద్యులు డాక్టర్ హర్ష, డాక్టర్ రంజిత్రెడ్డి, డాక్టర్ సాయితేజ, యూనికార్పస్ ఫిజీషియన్ డాక్టర్ సు జాత, సెంట్రల్ బ్లడ్బ్యాంక్ కౌన్సెల్లర్ రహమతుల్లా, ఫె ర్నాండెజ్ దవాఖాన కౌన్సెలర్ సుమిత్రలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కార్యదర్శి మదన్ మోహన్, డాక్టర్ అరుణ బాల, టీ సాక్స్ డిప్యూటీ డైరెక్టర్ మేఖల, అర్చన పాల్గొన్నారు.