బడంగ్పేట, ఏప్రిల్ 29: ఓ ఏఎస్ఐ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు భారీ మొత్తంలో బంగారం, నగదు దోచుకెళ్లారు. మీర్పేట సీఐ మహేందర్రెడ్డి కథనం ప్రకారం.. విజయపురికాలనీలో నివాసముంటున్న శంకర్ ఛత్రినాక పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. శుభకార్యానికి వెళ్లి గురువారం సాయంత్రం తిరుగొచ్చిన శంకర్ భార్య లక్ష్మి ఇంట్లో 35 తులాల బంగారం, రూ. 17 లక్షల నగదు పోయినట్లు మీర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీసీపీ సన్ప్రీత్ సింగ్, ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సీఐ మహేందర్రెడ్డి, డీఐ భాస్కర్ ఘటనాస్థలికి చేరుకొని.. డాగ్ స్వాడ్, క్లూస్ టీమ్తో తనిఖీలు చేయించారు. ఇంటికి వేసిన తాళం అలాగే ఉన్నా.. స్క్రూలు మాత్రం తీసినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.