జీడిమెట్ల, నవంబర్ 30: ప్రేమ విఫలమైందో..,సెల్ఫోనే వ్యసనమైం దో… తేల్చుకోలేని వ్యవహారాలు మమేకమై.. ఓ యు వకుడిని ఆత్మహత్యకు ప్రేరేపించాయి. మానసిక క్షోభను తట్టుకోలేక బీటె క్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ కె.బాలరాజు తెలిపిన ప్రకారం, ఎస్సార్ నాయక్ నగర్ జనప్రియ అపార్టుమెంట్స్లో నివాసం ఉండే బయోరా సరస్వతికి ప్రేమ్సింగ్(22), ఒక కూతురు ఉన్నారు. తండ్రి శ్యామ్సింగ్ కొన్నేండ్ల క్రితం మృతి చెందాడు.
తల్లి సరస్వతి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ప్రేమ్సింగ్ కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. సెల్ఫోన్కు బానిసైన ప్రేమ్సింగ్ కాలేజీకి వెళ్ళకుండా ఇంట్లో వేరుగా ఉన్న ఓ గదిలో ఉండేవాడు. గచ్చిబౌలికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమ్సింగ్ గాఢంగా ప్రేమిస్తున్నట్టు తెలిసింది. ఆ అమ్మాయి ప్రేమ్సింగ్ను నిరాకరించడంతో మనస్తాపానికి గురై వేరుగా ఉన్న గదిలో రెండు మూడు రోజులైనా బయటకు వచ్చే వాడు కాదు. ఈ నెల 27వ తేదీన రాత్రి 10 గంటలకు తల్లితో కలిసి భోజనం చేసిన అనంతరం, గదిలోకి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగా ఫోన్తో ఉన్నాడేమోనని తల్లి అనుకుంది. రెండు రోజులకు కూడా బయటకు రాకపోవ డంతో సోమవారం రాత్రి 11 గంటలకు 100కు డయల్ చేసి పోలీసులకు తల్లి సరస్వతి సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్కు ఉరేసుకుని విగత జీవిగా కనిపించాడు.