ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్,ఏప్రిల్1: కులమతాకతీతంగా పేద మధ్యతరగతి అనే తారతమ్యం లేకుండా ప్రభుత్వం అన్ని వర్గాల కు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. శుక్రవారం పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో మైనారిటీ నాయకులతో పాటు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మసీదలు, ఈద్గాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని పండుగలకు సమప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, జీహెచ్ఎంసీ ఉపకమిషనర్లు ప్రశాంతి, మంగతాయారు, హెచ్ఎండబ్ల్యూఎస్ జనరల్ మేనేజర్ శ్రీధర్రెడ్డి, ఇంజినీరింగ్ విభాగం ఈఈలు కృష్ణచైతన్య, గోవర్ధన్గౌడ్, ఎలక్ట్రికల్, శానిటేషన్ విభాగం అధికారులు, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్ పాల్గొన్నారు.
చలి వేంద్రం ప్రారంభం..
జీడిమెట్ల, ఏప్రిల్ 1 : గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ పరిధి ఎన్ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలి వేంద్రాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, యువకులు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, వెంకటేశ్, బస్వరాజ్, తాళ్లపల్లి శేఖర్రావు, బండారు వరప్రసాద్, ప్రభాకర్గుప్తా, గౌతమ్, చంద్ర, సుదర్శన్రెడ్డి, కుమార్ పాల్గొన్నారు.
విద్యార్థులు పట్టుదలతో చదవాలి..
గాజులరామారం, ఏప్రిల్ 1 : విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సూచించారు. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మగ్దూంనగర్ భగత్సింగ్ మార్గ్లో గల శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో గురువారం రాత్రి నిర్వహించిన వార్షికోత్సవాన్ని నిర్వహించారు. కార్పొరేటర్లు కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, రావుల శేషగిరిరావు, మోటివేటర్ డాక్టర్ సుధారాణిలతో కలిసి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల కరప్పాండెంట్ ఆంజనేయులు, ప్రిన్సిపాల్ శోభారాణి, పలు పాఠశాలల కరస్పాండెంట్స్ రామేశ్వర్రెడ్డి, హనుమంత్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ బాలరాజు, నర్సింహ, వినోద్ జాదవ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్ పాల్గొన్నారు.