ఎమ్మెల్యే వివేకానంద్
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
దుండిగల్, మార్చి 20 : నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని విధాల అభివృద్ధిపరిచి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో రూ.కోటి 91లక్షల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి, నిర్మాణ పనులను మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డితో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు. 16, 17, 19, 28 డివిజన్లలో రూ.కోటి15 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, లైబ్రరీ, డ్వాక్రా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.30లక్షల వ్యయంతో 30వ డివిజన్ జర్నలిస్ట్ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్డుతోపాటు హైరైజ్ ఫేజ్-2లో రూ.26లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజాంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.కోట్ల నిధులు వెచ్చించి భవిష్యత్లో జనాభాకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
మెరుగైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నిజాంపేటను మోడల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధన్రాజుయాదవ్, కార్పొరేటర్లు ఆగంపాండు ముదిరాజు, ఆగంరాజు ముదిరాజు, కాసాని సుధాకర్ ముదిరాజు, కొలన్ వీరేందర్రెడ్డి, బాలాజీనాయక్, కొలన్ మీనాసునిల్రెడ్డి, చిట్ల దివాకర్, సురేశ్రెడ్డి, ప్రణయ, బొర్రదేవీ చందూ, జ్యోతిరెడ్డి, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కొలన్ గోపాల్రెడ్డి, నిజాంపేట టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయప్రసాద్, నేతలు నాగరాజు యాదవ్, చందూ, సునీల్రెడ్డి, జగన్ యాదవ్, స్వామి, జర్నలిస్ట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మారుతీసాగర్, ఉపాధ్యక్షుడు లాలయ్యతో పాటు పలువురు నిజాంపేట మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
9వ డివిజన్ కార్పొరేటర్ రజితారవికాంత్, ప్రహరి ట్రస్ట్ నిర్వాహకులు రాము అనే దివ్యాంగుడికి ఎలక్ట్రికల్ త్రీవీలర్ను ఎమ్మెల్యే వివేకానంద్, మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి సమక్షంలో అందజేశారు.
8వ డివిజన్ పరిధిలోని ఆదిత్యలగూన్ సంక్షేమ సంఘం, ఆద్యస్కంధ క్లీనిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే, మేయర్ ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, నిర్వాహకులు పాల్గొన్నారు.
నిజాంపేట నుంచి బాచుపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని నిజాంపేట టాక్స్పేయర్స్, నిజాంపేట, ఖాజిపల్లి రేడియల్ రోడ్డు సాధన సమితి ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.