బడంగ్పేట, మార్చి 15: మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ మిథిలానగర్లో వరదకాలువల నిర్మాణ పనులను మంగళవారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గాదీప్లాల్ చౌహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత సంవత్సరం భారీ వర్షాలకు కార్పొరేషన్ పరిధిలో అనేక కాలనీలు మునిగిపోయిన దృష్ట్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి కార్పొరేషన్ పరిధిలో వరదనీటి కాలువల నిర్మాణం కోసం సుమారు రూ.35.19కోట్ల నిధులు కేటాయించారన్నారు. మొదటి విడుతలో రూ.6.30కోట్లతో మంత్రి ఆదేశాల మేరకు పనులను ప్రారంభించామన్నారు. మంత్రాల చెరువు నుంచి చందన చెరువు వరకు పనులు జరుగుతాయన్నారు. ఎటువంటి ఆటంకాలు రాకుండా సకాలంలో పూర్తి చేసే విధంగా ప్రజలు, ప్రజా ప్రతినిధులు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ భూపాల్రెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, ఎస్ఈ కృష్ణారావు, డీఈ గోపీనాథ్, ఎస్ఎన్డీపీ డీఈ అనురాధ, కార్పొరేటర్ సురేఖ రమేశ్, నాయకులు కామేశ్రెడ్డి, హారతి, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు, ఫణికుమార్, రామకృష్ణ, వెంకటేశ్, ప్రభాకర్, రాజు, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.