కుత్బుల్లాపూర్, మార్చి 15 : మేడ్చల్ నియోజకవర్గం, దేవరయాంజల్లో సీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించిన భూములు రోజురోజుకు అన్యాక్రాంతం అవుతున్నాయని.. వాటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడు తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అసెంబ్లీ చర్చలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం జరిగిన బడ్జెట్ చివరి రోజు సభలో దేవరయాంజల్ గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయ భూములు చాలా దశాబ్దాలుగా కబ్జాలకు గురైనట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. దీనిపై ప్ర భుత్వం ఐఏఎస్లతో కూడిన ప్రత్యేక కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరిందా..? ఎలాంటి చర్యలు చేపట్టనున్నారని ప్రస్తావించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. దేవాలయ భూ ములు అన్యాక్రాంతం కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింద న్నారు. దీనిలో భాగంగా సీతారామచంద్రస్వామి ఆలయ భూ ముల కబ్జాపై ఐఏఎస్ల కమిటీ నివేదిక పూర్తి కావచ్చిందని, ఆ కమిటీ నివేదిక త్వరలో అందనుందన్నారు. ఒక్క గజం భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా దేవుని మాన్యం ప్ర భుత్వం కాపాడుతుందని, అలాంటి ఆస్తుల పరిరక్షణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే అని స్పష్టం చేసినట్లు తెలిపారు.