కుత్బుల్లాపూర్, మార్చి 13 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి.. ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకా నంద్ అన్నారు. ఆదివారం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.5.40 కోట్ల వ్యయంతో పూర్తి అయిన అభివృద్ధి పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులను చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, వైస్ చైర్మన్ రత్లావత్ గంగయ్యనాయక్, కమిషనర్ రఘు, కౌన్సిలర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ సహకారంతో మరిన్ని నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. కాలనీల్లో పార్కులు, సీసీరోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ల తో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు డప్పు కిరణ్కుమార్, చింతల రవీందర్, సన్న రవీం దర్, పార్టీ శ్రేణులు జిమ్మి దేవేందర్, చింతల దేవేందర్తోపాటు కా ర్యకర్తలు, కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
కొంపల్లిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొంపల్లి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించి మాట్లాడారు. నిరుపేదలకు ఉచితంగా సేవ చేయాలని ముందుకు రావడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో చైర్మన్ సన్న శ్రీశైలం, వైస్ చైర్మన్ రత్లావత్ గంగయ్యనాయక్, మాజీ ఎంపీపీ సన్న కవిత, కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు, ఐఎంఏ కొంపల్లి ప్యానల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకట్రాయనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తమ కాలనీలో కమ్యూనిటీహాల్ నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందించారు. రూ.20 లక్షల వ్యయంతో నిర్మించేందు కు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
బడ్జెట్ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని కుత్బుల్లాపూర్ మండల బడ్జెట్ పాఠశాలల యాజమాన్య సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను కోరారు. ఆయన స్పందిస్తూ ప్రాపర్టీ టాక్స్పై 2 శాతం వడ్డీ వసూలు చేసే విషయం, ట్రేడ్ లైసెన్స్ నోటీసులు బడ్జెట్ పాఠశాలలకు ఇచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చా రు.
జీడిమెట్ల డివిజన్ పరిధిలో వైష్ణయ్ ఎన్క్లేవ్లో రూ.3.21 కోట్లతో నూతనంగా చేపడుతున్న భూగర్భడ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రంగు వెంకటేశ్గౌడ్, ఏఈ సురేందర్నాయక్, భిక్షపతి, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.