మాదాపూర్ / కొండాపూర్, మార్చి 13 : వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్స్ వద్ద రూ. 1.55 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న నాలా విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం విప్ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాలాల విస్తరణ త్వరగా పూర్తి చేయాలని ఇం జినీరింగ్ అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కోట్లాది రూపాయాలను వెచ్చించి నా లాల విస్తరణ చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్లో వరద ముంపుతో ప్రజలు ఇబ్బందులు పడకుండా నాలాల విస్తరణ పనులు చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు శ్రీనివాస్యాదవ్, హరీశ్, దీప్తిశ్రీనగర్ కాలనీ వాసులు సీతారామయ్య, చంద్రశేఖర్రావు, వెంకట్, నెహ్రూ, మంగపతి, రామారావు, మహేశ్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
కల్వర్ట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
నాణ్యత విషయం లో రాజీ పడకుండా కల్వర్ట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడలో జాతీయ రహదారి ఎన్హెచ్ 65 వద్ద జరుగుతున్న కల్వర్ట్ నిర్మాణ పనులను ఆదివారం స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చ్తివుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా అవసరాలపై దృష్టి పెట్టడంతో పాటు నాలాలు, కల్వర్ట్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. నాలాల్లో పేరుకుపోయిన మట్టిని వెంటనే తొలగించాలని, కల్వర్ట్ నిర్మాణ పనులపై సలహాలు, సూచనలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, మాదాపూర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్యాదవ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.