బడంగ్పేట, ఫిబ్రవరి 22: సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడున్నర కోట్ల అభివృద్ధి పనులకు చేవళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు.
చెరువుల సుందరీకరణ
చెరువుల సుందరీకరణ చేయడంతో పర్యాటక శోభ సంతరించుకుంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మూడు చెరువులను సందరీకరణ చేయిస్తున్నామన్నారు. ఇప్పటికే సందచెరువును సుందరీకరణ చేయడం జరిగిందన్నారు. పెద్ద చెరువు, మంత్రాల చెరువు సుందరీకరణ పనులు జరుగుతున్నాయని అన్నారు. త్వరలో చెరువుల దగ్గర బోటింగ్ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. పిల్లలకు, సీనియర్ సిటిజన్లకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నామని అన్నారు. వరదనీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ట్రంక్లైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి కమిషనర్ నాగేశ్వర్, కార్పొరేటర్లు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.