రామంతాపూర్,డిసెంబర్ 20 : దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ రాష్ట్రం లో దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం హబ్సిగూడ డివిజన్లో దళితబంధు పథకం కింద సుద్దాల పూర్ణచందర్, సందీప్కుమార్ ఏర్పాటు చేసిన పాడిగేదెల వ్యాపారం యునిట్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళిత బంధు పథకం ద్వారా రాష్ట్రంలో ఎంతో మంది దళితులు ఉపాధి పొందుతున్నారన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని యువతకు ఉపాధికల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలా జీ, నాయకులు డాక్టర్ చారి, రవికుమార్, సుధాకర్, రవీందర్రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీధర్ రెడ్డి, మనోహర్, సంతోష్రెడ్డి, రవీందర్రెడ్డి, లింగానా య క్, రవినాయక్, వంశీముదిరాజ్, వెంకటేశ్వర్రెడ్డి, చందునాయక్, భాగ్య లక్ష్మి, ధనలక్ష్మి, భాగ్యరేఖ, మహబూబి పాల్గొన్నారు.
క్రిస్మస్ కానుకల పంపిణీ..
ఉప్పల్ డివిజన్ పరిధి, చర్చికాలనీలోని చర్చిలో ప్రభుత్వం అందించిన క్రిస్మస్ కానుకలను మంగళవారం క్రైస్తవులకు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాదర్ జోసెఫ్ ప్రాన్సిస్ ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు వేముల సంతోష్రెడ్డి, గరిక సుధాకర్, సుధాకర్, చిన్నారావు, రత్నాకర్, రాజు యాదవ్, వెంకటేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.