ఖైరతాబాద్, డిసెంబర్ 16: విద్యార్థులు తమ ఆలోచనకు పదునుపెట్టాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ విపిన్ కుమార్ అన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ ఆడిటోరియంలో శుక్రవారం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ముగింపు సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విపిన్కుమార్ మాట్లాడుతూ దేశంలో నేడు కొత్త ఆలోచనలతో అనేక మంది స్టార్టప్స్తో ముందుకు వస్తున్నారని, అలాంటి వారికి తమ ప్రోత్సాహం ఉంటుందన్నారు. అనంతరం పలువురు విద్యార్థులు ప్రదర్శించిన నూతన ఆవిష్కరణలను వీక్షించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.