ఎల్బీనగర్, డిసెంబర్ 16 : ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతపై వరల్డ్ విజన్ యూనిసెఫ్ సేవలు అభినందనీయమని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కొనియాడారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరల్డ్ విజన్ యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జెండా ఊపి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న సామాజిక సేవలు ఎంతగానో గర్వించదగ్గ విషయమని తెలిపారు. ప్రచార రథంలో ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శీతాకాలంలో అనారోగ్యాల బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవాలని పలు సూచనలు, సలహాలిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్సురాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, సత్యంచారి, చంద్రశేఖర్రెడ్డి, చాపల శ్రీనివాస్, రఘుమారెడ్డి, డిస్ట్రిక్ కో-ఆర్డినేటర్ మనోహర్ డేవిడ్, మేనేజర్ దీపక్ కుమార్ నాయక్, విజయ్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల సమస్యకు పరిష్కారం చూపుతాం
సహారాస్టేట్స్కాలనీలోని రోడ్ల సమస్యను త్వరలో పరిష్కరింపజేసేందుకు చర్యలు తీసుకుంటానని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ సహారాస్టేట్స్కాలనీ మెయింటెనెన్స్ కమిటీ అధ్యక్షుడు కరణం శ్రీకాంత్, మాజీ అధ్యక్షుడు సయ్యద్ జానీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి క్యాంపు కార్యాలయానికి వేర్వేరుగా వెళ్లి కాలనీలో నెలకొన్న రోడ్లు, బాక్స్టైప్ ట్రంక్లైన్ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీవాసులు సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కాలనీ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి వారు ఎదుర్కొంటున్న ప్రధానమైన రోడ్లు, ట్రంక్లైన్ సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, కాలనీ ప్రధాన కార్యదర్శి వల్లూరిపల్లి పార్థసారథి, కోశాధికారి పెరువాల జగత్రెడ్డి, ఉపాధ్యక్షుడు రేణుకుంట్ల రాఘవేందర్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, కాలనీవాసులు వెంకటాద్రి, సుదర్శన్ రెడ్డి, శీనయ్య, ఓపీ సింగ్, మేకల ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రసాద్ రావు, నర్సింహ గౌడ్, బెల్లంకొండ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.