గోల్నాక, డిసెంబర్ 5: జల్సాలకు అలవాటు పడి.. దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను అంబర్పేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆరు ద్విచక్ర వాహనాలతోపాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్దత్ తెలిపిన వివరాల ప్రకారం… అంబర్పేట పటేల్నగర్కు చెందిన పి.హేమంత్ కుమార్ (22), ఉప్పల్కు చెందిన పి.దీపక్ (20), రామంతాపూర్ వెంకట్రెడ్డినగర్కు చెందిన ఓంకార్ భరత్రాజు(20), సరూర్నగర్కు చెందిన సాయికుమార్ (24) స్నేహితులు. వీరు జల్సాలకు అలవాటు పడ్డారు. అవసరాలు తీర్చుకునేందుకు నేరాలు మొదలుపెట్టారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ.. వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. సోమవారం అంబర్పేట పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన అంబర్పేట ఇన్స్పెక్టర్ పి.సుధాకర్ను, డీఐ హెచ్.ప్రభాకర్, డీఎస్సై రామచందర్రాజుతో పాటు క్రైం సిబ్బందిని ఈ సందర్భంగా డీసీపీ సునీల్దత్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్రెడ్డి, ఏసీపీ వెంకటరమణ అభినందించారు.