శామీర్పేట, డిసెంబర్ 5: రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించినప్పుడే నేల సారవంతంగా మారుతుందని జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యా అన్నారు. శామీర్పేట మండల అలియాబాద్లోని రైతువేదికలో సోమవారం ప్రపంచ మృత్తిక(నేల) దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు తమ భూమిలో మట్టి పరీక్షలు చేసి పోషక విలువలు తెలుసుకోవాలన్నారు. సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వాడి నేల సారవంతాన్ని కాపాడాలన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించి లాభసాటి వ్యవసాయ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అధ్యక్షుడు నందారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, డీఏవో మేరిరేఖ, డీహెచ్ఓఎస్వో నీరజగాంధీ, డీజీడబ్ల్యువో రేవతి, ఎంపీపీలు ఎల్లూభాయిబాబు, హారికమురళిగౌడ్, రైతుబంధు మం డల అధ్యక్షులు కృష్ణారెడ్డి, శ్యామల, సర్పంచ్లు కుమార్యాదవవ్,రవి, ఆంజనేయులు, రాంచంద్రయ్య, ఇస్తారి, ఎంపీటీసీలు అశోక్, నాగరాజు, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, ఉపసర్పంచ్ ప్రభాకర్రెడ్డి, డైరెక్టర్లు భూం రెడ్డి, నరేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, ఏఈవోలు రవి, జ్యోతి, రైతులు పాల్గొన్నారు.
భూసార పరీక్షలు చేయించుకోవాలి
ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 5: మండల పరిధి ఏదులాబాద్, ప్రతాపసింగారం గ్రామాల్లోని రైతు వేదిక భవనంలో సోమవారం ప్రపంచ మృతిక(నేల) దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు హాజరైన మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ మట్టి నమూనాలను సేకరించి వాటి ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేయాలని సూచించారు.కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్,సర్పంచ్లు శివశంకర్, సురేశ్, మండల సహకార సంఘం వైస్ చైర్మన్ అనంత రెడ్డి, డైరెక్టర్లు రమేశ్, ఉదయ్ కుమార్, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు భిక్షపతి గౌడ్, మండల సభ్యులు మంకయ్య, మండల వ్యవసాయాధికారి బాసిత్, ఏఈవోలు సురేశ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి
కీసర, డిసెంబర్ 5: సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి సాధించవచ్చని మండల వ్యవసాయాధికారి మాధవిలత అనారు. మండల పరిధి యాద్గార్పల్లిలోని రైతు వేదికలో సోమవారం ప్రపంచ మృతిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో నేల ప్రాముఖ్యత, మట్టి పరీక్ష చేయించుకోవడం వల్ల కలిగే లాభాలు, మట్టి సేకరించే విధానం పై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల విస్తర్ణాధికారి వందన, సత్యనారాయణ, రైతుబంధు గ్రామ అధ్యక్షులు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.