దుండిగల్, డిసెంబర్ 3 : ప్రతిభావంతులై ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఆదుకునేందుకు ఎల్లప్పుడు తాను సిద్ధంగా ఉంటానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. గాజులరామారం ప్రాంతానికి చెందిన పెంటయ్య కుమార్తె లావణ్య చదువుల్లో రాణిస్తున్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రెండేండ్ల కిందట ‘గిఫ్ట్ ఏస్మైల్’లో భాగంగా లావణ్యను ఉన్నత చదువుల నిమిత్తం తన సొంత ఖర్చులతో బెంగళూర్కు పంపించారు. న్యూట్రిషనిస్ట్గా కోర్స్ పూర్తి చేసిన లావణ్య శనివారం శంభీపూర్లోని కార్యాలయంలో ఎమ్మెల్సీ శంభీపూర్రాజును కుటుంబసభ్యులతో కలిసి కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలిస్తే వారు ఆయా రంగాల్లో రాణిస్తారని, ఆర్థిక ఇబ్బందులతో విద్యను కొనసాగించలేని వారికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విజయ్రామ్రెడ్డి తదితరులు ఉన్నారు.
v మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన సంక్షేమ సంఘాలు, ప్రజాప్రతినిధులతోపాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలుకాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు, వివిధ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు శంభీపూర్రాజును శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగే శుభకార్యాలు, సమావేశాలకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికలు అందజేశారు. అదే విధంగా మరికొందరు తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.