చాదర్ఘాట్, డిసెంబర్ 3 : పురాతన డ్రైవేజీ లైన్ లో స్థానికులకు తిప్పలు.. కాలం చెల్లిన పైపులైన్తో ఛావునీ డివిజన్లోని బాగ్-ఏ-జహారా మదీనా మసీదు రోడ్డు లో 200 ఎంఎం (8 ఇంచుల) డయా ఓ ఏర్పాటు చేసిన నూతన డ్రైనేజీ పైపులైన్ తో సమస్యలు పూర్తిగా సమసిపోయాయని స్థానికులు పేర్కొంటున్నారు. పురాతన పైపులైన్ తో స్థానికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడంతో డివిజన్ కార్పొరేటర్ ఎం.ఏ.సలాం షహీద్, ఎమ్మెల్యే అహ్మద్ బలాల చొరవతో డ్రైనేజీ పైపులైన్ పనులు వెంటనే చేపట్టే విధంగా జలమండలి అధికారులను ఆదేశించారు. కొంత కాలం క్రితం ప్రారంభమైన పనులు పూర్తికావడంతో కొత్తగా వీడీసీసీ రోడ్డు వేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ముమ్మరంగా పనులు చేపడుతున్నారు. దాదాపు రూ.18.5 లక్షల వ్యయంతో 8 ఇంచుల పైపులైన్ పనులను చేపట్టారు. జలమండలి చంచల్గూడ సెక్షన్ పరిధిలోని బాగ్-ఏ-జహారా, మదీనా మసీదు రోడ్డు లో రూ.18.5 లక్షల వ్యయంతో కొన్ని మీటర్ల దూరంలో పైపులైన్ పనులను పూర్తి చేశారు.
పనులన్నీ పూర్తయ్యాయి..
బాగ్-ఏ-జహారాలో రూ.18.5 లక్షల వ్యయంతో డ్రైనేజీ పైపులైన్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వీడీసీసీ రోడ్డు పనులు చేపడుతుండడంతో అక్కడక్కడ స్వల్ప మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. బాగ్-ఏ-జహారా లో డ్రైనేజీ సమస్యలు ఇకమీదట తప్పనున్నాయి.
– నవీన్, జలమండలి మేనేజర్