వెంగళరావునగర్, డిసెంబర్ 3 : దివ్యాంగుల ఆత్మైస్థెర్యం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శనివారం వెంగళరావునగర్ డివిజన్..యూసుఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిల్-19 ఆధ్వర్యంలో మధురానగర్ కమ్యూనిటీహాల్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన దివ్యాంగుల కార్య సంకల్పం కార్యక్రమానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో అవరోధాలను, కష్టాలను జయిస్తూ దివ్యాంగులు జీవితంలో ముందుకు సాగుతున్నారని అన్నారు. దివ్యాంగుల కోసం తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని..దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రూ.3,016 పెన్షన్ను ప్రతినెలా దివ్యాంగులకు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉప కమిషనర్ రమేశ్తో కలిసి ఎమ్మెల్యే మాగంటి దివ్యాంగులను సత్కరించి వారికి సదరం సర్టిఫికెట్లను అందజేశారు. వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య, యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, డీపీవో హిమబిందు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కోనేరు అజయ్, సంతోష్, కాలనీ అధ్యక్షుడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు
కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత
ఎర్రగడ్డ: బోరంబడలో 67 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంతో పండుగ వాతావరణం ఏర్పడింది. డివిజన్లోని సైట్-3 హైటెక్ హోటల్ చౌరస్తా వద్ద శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేసి చెక్కులతో పాటు కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది పేద కుటుంబాలు బాగు పడ్డాయన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి సందీప్, డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్చార్జి సయ్యద్సిరాజ్, ఏడీ మధు, యూసుఫ్, ఎండీ గౌస్, గఫార్, రమేశ్నాయక్, ధర్మ, రాములు ముదిరాజ్, కవిత, సరళ, ఎన్ఆర్ఆర్ పురం హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ఎంఏ సత్తార్, వెంకటేశ్, ఫయాజ్ఖాన్,పాల్గొన్నారు.
శ్రీకాంతాచారికి ఘన నివాళి
ఎర్రగడ్డ, డిసెంబర్ 3: తెలంగాణ ఉద్యమ పోరులో అమరుడు శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శనివారం శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకుని బోరబండలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్చార్జి సయ్యద్సిరాజ్ పాల్గొన్నారు.