సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) 2023ను అనుసరించి జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న అర్హత గల విద్యార్థులచే ఓటరు నమోదు చేయించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్ఓలను ఆదేశించారు. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సరిల్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలను గుర్తించి ప్రిన్సిపాల్ సహకారంతో ప్రతి విద్యార్థి ఓటరు నమోదు చేసుకునేలా చూడాలని ఈఆర్ఓలకు సూచించారు.