శామీర్పేట, నవంబర్ 28: మహాత్మా జ్యోతిరావుఫూలే వర్ధంతిని మేడ్చల్ నియోజవర్గ వ్యాప్తంగా సోమవారం నిర్వహించారు.మున్సిపాలిటీలు, మండల కేంద్రా ల్లో ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మేడ్చల్లో మున్సిపల్ కమిషనర్ మహ్మద్ షఫీఉల్లాఖాన్, 23వ కౌన్సిలర్ కౌడే మహేశ్ ఫూలే విగ్రహానికి పూలమాల వేసినివాళులర్పించారు. కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ సిబ్బంది రాంచందర్, మహేశ్వర్రెడ్డి, మేడ్చల్ పట్టణ పురప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావుఫూలే వర్ధంతి సందర్భంగా శామీర్పేటలో అఫ్జల్ఖాన్, వెంకట్రెడ్డి, షేక్చాద్పాషా, నిస్సార్, చందర్, మహేశ్, సత్యనారాయణ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గుండ్లపోచంపల్లి పురపాలక సంఘం పరిధిలో మహాత్మా జ్యోతిరావుఫూలే వర్ధంతి సందర్భంగా చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ డి.ప్రభాకర్, కౌన్సిలర్లు శ్రీనివాస్, మల్లికార్జున్ముదిరాజ్, హేమంత్రెడ్డి, బాలరాజ్, హంసరాణి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, కృష్ణగౌడ్, మోహన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సంజీవ, శ్రీనివాస్గౌడ్, ప్రవీన్, రమేశ్, జగన్, నవీన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
n భావితరాలకు స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావుఫూలే అని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మహాత్మా జ్యోతిరావుఫూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పూలే వర్ధంతి సందర్భంగా గాయకుడు వెంకటాచారి రచించిన పాటను అంబేద్కర్ చౌరస్తాలో డిప్యూటీ మేయర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిషనర్ రామలింగం, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ ఆర్ఓ ప్రభాకర్యాదవ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.