సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : స్పెషల్ సమ్మర్ రివిజన్ 2023ను అనుసరించి వచ్చే సంవత్సరం జనవరి 1 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒకరు ఓటరుగా నమోదు చేసుకోవాలని హైదరాబాద్ ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కొత్తగా ఓటరు నమోదు చేసుకునేలా కళాశాల యాజమాన్యం క్లాస్ల వారీగా వివరాలను ఇస్తే అకడే నమోదు కేంద్రం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఒకొక సరిల్కు సూపర్ వైజర్ అధికారులను నియమించామని చెప్పారు. వారు సరిల్ పరిధిలోని కళాశాల ప్రిన్సిపాల్స్తో కలుస్తారని, వారికి పూర్తి సహకారం అందించాలన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో నివసించే వారే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన అర్హత గలవారు కూడా వారు కోరుకునే నియోజకవర్గంలో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, కో ఆర్డినేటర్లు, కాలేజ్ అంబాసిడర్లు ఓటరు నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రత్యేకంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో నూతన ఓటరు నమోదు (ఫారం-6)తో పాటుగా ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ నంబర్ అనుసంధానానికి(ఫారం 6బీ), కొత్త ఓటరు చేర్పు పై అభ్యంతరాలు/ఓటరు జాబితాను నుంచి పేరు తొలగించేందుకు (ఫారం-7), ఓటరు చిరునామాలో మార్పులు, వేరే పోలింగ్ స్టేషనుకు పేరు బదిలీ, ఓటర్ల జాబితాలోని ఓటరు వివారాల్లో తప్పుల సవరణ, ఓటరు గుర్తింపు కార్డులో మార్పులు, దివ్యాంగులుగా గురింపు కోసం (ఫారం -8) కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.