సుల్తాన్బజార్, నవంబర్ 22 : నిత్యం విధి నిర్వహణలో బిజీ ఉండే ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఎం చంద్రశేఖర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఉద్యోగి వ్యాయామం చేయడంతో పాటు క్రీడలలో పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు వారి ఆరోగ్యంపై టీఎన్జీవో నిరంతరం కృషి చేయడం మంచి విషయమని ప్రశంసించారు. గత 8 సంవత్స రాలుగా టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న ముజీబ్ హుస్సేనీని ప్రత్యేకంగా అభినందించారు. ముజీబ్ హుస్సేనీ మాట్లాడుతూ.. జింఖాన మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించే నాకౌట్ మ్యాచ్లలో 27 టీంలు పాల్గొంటాయని తెలిపారు.
కాగా, మంగళవారం జరిగిన మ్యాచ్లో జిల్లా సహకార శాఖ టీంపై హైదరాబాద్ జిల్లా విద్యా శాఖ టీం గెలుపొంది విజేత గా నిలిచింది. ఈ కార్యక్రమంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, సీమా ముజీబ్, టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్, కస్తూరి వెంకటేశ్వర్లు, కేంద్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొండల్రెడ్డి, నగర శాఖ అధ్యక్షుడు శ్రీరాం, కార్యదర్శి కట్కూరి శ్రీకాంత్, తెలంగాణ నాలుగో తరగతి కేంద్ర సంఘం అధ్యక్షులు గడ్డం జ్ఞానేశ్వర్, కార్యదర్శి ఖాదర్ బిన్ హసన్, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ కార్యదర్శి ఎస్ విక్రమ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు కురాడి శ్రీనివాస్, మురళీరాజ్, పీఆర్వో జహంగీర్ అలీ,ఏపీఆర్వో మహ్మద్ వహీద్ తదితరులు పాల్గొన్నాయి.