ముషీరాబాద్, నవంబర్ 22: ముషీరాబాద్ డివిజన్ కమలానెహ్రూనగర్లో రూ.6 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులను మంగళవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బస్తీల్లో మౌలిక సదుపాలు కల్పించడంతోపాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి ముషీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, పెండింగ్ పనులను దశలవారీగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎమ్మెల్యే చేయని విధంగా నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. డివిజన్లలో తీవ్రంగా ఉన్న డ్రైనేజీ సమస్యలను చాలా వరకు పరిష్కరించామని, త్వరలో కమలానెహ్రూనగర్లో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ కార్పొరేటర్ ఎం.సుప్రియా నవీన్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, ముషీరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్కుమార్, శ్రీధర్రెడ్డి, శివముదిరాజ్, దీన్దయాల్రెడ్డి, గంట రాజు, వెంకటేశ్, సదా, నర్సింగ్, పరుశరాం, బల్ల ప్రశాంత్, శోభ, సత్యనారాయణ, జబ్బర్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్కు ధీటుగా వైద్య సేవలందించేందుకు సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలను కేటాయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్లోని అంజుమన్ హైస్కూల్లో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్(ఎస్ఆర్డీ), రెయిన్బో హోమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని భోలక్పూక్ డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ గౌసొద్దీన్, టీఆర్ఎస్ నగర యువజన విభాగం సీనియర్ నాయకుడు ముఠా జయసింహ, జిల్లా డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజాశ్రీ, ఎస్ఆర్డీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకొని తమ ఆరోగాల్యను కాపాడుకోవాలని అన్నారు. ఈ వైద్య శిబిరంలో వివిధ దవాఖానల వైద్యాధికారుల సమక్షంలో దాదాపు 800 మంది రోగులకు బీపీ, షుగర్, ఈసీజీ, జనరల్ పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బైబిల్ హౌజ్ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శృతి, కేర్ దవాఖాన వైద్యులు డాక్టర్ వీరసోములు, డాక్టర్ మనీత్, డాక్టర్ రాజు, ల్యాబ్ టెక్నీషియన్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బంది, ఆశవర్కర్లు ఎస్ఆర్డీ సిబ్బంది శివరాణి, ఇందిరా భారతి, నగ్మా పర్వీన్, పార్వతి, రెయిన్బో హోమ్ సీనియర్ మేనేజర్ శ్రీలత, కమ్యూనిటీ టెస్ట్కేర్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ క్రాంతి కిరణ్, టీఆర్ఎస్ నాయకులు శంకర్ గౌడ్, ఛాంద్ పాషా, రహ్మత్ అలీ, హాజీ పాషా, జబ్బార్, మక్బూల్, డాక్టర్ సల్మాన్ తడి తదితరులు పాల్గొన్నారు.