సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణాల వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి రీయూజ్ (పునర్ వినియోగం)లోకి తీసుకువచ్చేందుకు మరో రెండు చోట్ల సీ అండ్ డీ (కన్స్ట్రక్షన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్ను నెలకొల్పారు. తొలుత జీడిమెట్ల, నాగోల్ ఫతుల్లాగూడలో సీ అండ్ డీ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఒక్కో ప్లాంట్ ద్వారా రోజుకు 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను శుద్ధి చేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ జోన్ వైపు శామీర్పేట మండలం తూముకుంట గ్రామంలో, చార్మినార్ జోన్ వైపు శంషాబాద్ సాతంరాయి గ్రామంలో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ ఒకొక ప్లాంట్ రోజుకి 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరో ఏజెన్సీకి 15 సర్కిళ్ల కేటాయింపు
నిర్మాణ వ్యర్థాలు తరలించేందుకు సరిల్ వారీగా సీఅండ్డీ ప్లాంట్ 4 ప్లాంట్లు ఒకొక ఏజెన్సీ రెండేసి ప్లాంట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఒక ఏజెన్సీకి 15 సరిళ్లు కేటాయించారు. తాజాగా మరొక ఏజెన్సీకి మరో 15 సరిళ్లను కేటాయించారు. ఈ ఏజెన్సీ వారు ప్రైవేటు వ్యక్తుల వ్యర్థాలను తరలించేందుకు టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన వారు వారిని సంప్రదిస్తే వారు మీ ఇంటికి వచ్చి వ్యర్థాలను తీసుకొని వెళ్తారు. ఇందుకు కలెక్షన్, రవాణా, ప్రాసెసింగ్ చార్జీలు జీహెచ్ఎంసీ నిర్దేశించిన ప్రకారంగా టన్నుకు వసూలు చేస్తారు. ఫతుల్లాగూడ, జీడిమెట్ల కలెక్షన్ ఏరియాకు టోల్ ఫ్రీ నంబర్ 1800 120 1159 , తూముకుంట, సాతంరాయి కలెక్షన్ ఏరియాకు టోల్ ఫ్రీ నంబర్ 1800 203 0033ను సంప్రదించాల్సి ఉంటుంది.
సరిల్ కేటాయింపు వివరాలు
ఉత్తరం, దక్షిణం వైపు ప్లాంట్ల ఏర్పాటు
నగరంలో నిర్మాణ వ్యర్థాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి ఉత్తరం, దక్షిణం వైపు ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. ఇంతకు ముందు ఫతుల్లాగూడ, జీడిమెట్ల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటితో 15 సరిళ్లలో మాత్రమే సేకరణ చేసేవారు. మరో 15 సరిళ్లలో వ్యర్థాల సేకరణ కోసం చార్మినార్, సికింద్రాబాద్ వైపు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. తూముకుంట, షాతంరాయి గ్రామం లో ఏర్పాటు చేశాం. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా నగరవాసులు తోడ్పాటునందించాలి.
– గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ మేయర్