మాదాపూర్, నవంబర్ 17 : మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన ఐడీఏసీ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆర్కిటెక్చర్ అండ్ కన్స్స్ట్రక్షన్) ఎక్స్పో 2022లో నూతన సాంకేతికతో కూడిన పలు రకాల ఆటోమేషన్ (గృహ) ఉత్పత్తులు నగర వాసులను ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమానికి హోగర్ కంట్రోల్ వైస్ ప్రెసిడెంట్ జస్ప్రీత్ సింగ్ బాటియా విచ్చేసి స్టాల్ నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ హోం ఆటోమేషన్ మార్కెట్ను మరింత వృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
స్మార్ట్ హోం ఆటోమేషన్ ఉత్పత్తులు భవిష్యత్లో గణనీయమైన వృద్ధిని సాధించనున్నట్లు తెలిపారు. అన్ని రకాల సెక్యూరిటీ సిస్టమ్తో ఈ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 50కి పైగా స్టాల్స్లను ఏర్పాటు చేశారు. ఇందులో హోం డెకార్స్, వైఫై ఎనబుల్డ్ స్మార్ట్ టచ్ ప్యానెల్స్, స్మార్ట్ కంట్రోలర్లు, డిజిటల్ డోర్ లాక్స్, ఫ్లోరింగ్ మ్యాట్స్, టైల్స్, బ్రిక్స్, కార్పెట్స్, పెయింట్, ప్లంబింగ్ వర్క్ ఉత్పత్తులు, స్టోన్ టైల్స్, గ్రానైట్స్, ఫ్లోరింగ్, షవర్స్, కబోర్డ్స్, ఉడెన్ వర్క్ ఉత్పత్తులు, లాకర్స్, స్విచ్ బోర్డ్స్, స్మార్ట్ కటన్ మోటార్స్, స్మార్ట్ సెన్సార్స్తో పాటు మరిన్ని గృహ ఉత్పత్తులను ప్రదర్శించారు.