చర్లపల్లి, నవంబర్ 17 : స్వదేశీ పరిజ్ఞానంతో పాటు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని దేశవ్యాప్తంగా అణు ఇంధన వినియోగం కొనసాగిస్తున్నామని అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు చైర్మన్ జి.నాగేశ్వర్రావు, ఎన్ఎఫ్సీ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డాక్టర్ దినేశ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. గురువారం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ)సంస్థ, అణు ఇంధన సంస్థ న్యూక్లీయర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(ఎన్ఎఫ్సీ)సంయుక్త ఆధ్వర్యంలో క్యారక్టరైజేషన్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూయల్స్-2022 పేరిట డాక్టర్ హోమిజే బాబా కన్వెన్షన్ సెంటర్లో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సును వారు ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న సదస్సుకు కెనడా, రష్యా, కజకిస్తాన్, స్పెయిన్, అమెరికా, ఇరాన్ దేశాలకు చెందిన అణు ఇంధన సంస్థ ప్రతినిధులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అణు ఇంధన సంస్థ ప్రతినిధులు పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్సీ ఏసీఈ డి.ప్రామాణిక్, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ డాక్టర్ డీకే.సిన్హా, యూసీఐఎల్ సీఎండీ సీకే.అన్సారీలతో పాటు పలువురు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.