చర్లపల్లి, నవంబర్ 17 : సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగంలో జెడ్ సర్టిఫికెట్ మార్కెట్ విస్తరించడం.. కొత్త ఉత్పత్తుల ప్రక్రియకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ సుధీర్కుమార్ పేర్కొన్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని పారిశ్రామికవేత్తల సంఘం భవనంలో గురువారం సీఐఏ అధ్యక్షుడు డాక్టర్ గోవింద్రెడ్డి అధ్యక్షతన ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జీరో ఎఫెక్ట్, డిఫెక్ట్లపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా నినాదంతో పారిశ్రామికరంగంలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని, ముఖ్యంగా జెడ్ సర్టిఫికెట్తో డిఫెన్స్, పీఎస్యూ, బ్యాంకింగ్, డీఆర్డీఓ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు కావాల్సిన ఉత్పత్తులను సరఫరా చేయవచ్చన్నారు. జెడ్ కోఆర్డినేటర్ నవీన్కుమార్ మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు ఉద్యోగ్ ఆధార్ సంఖ్య తప్పక ఉండాలని, సంఖ్య ఆధారంగా జెడ్ సర్టిఫికెట్ పొందవచ్చన్నారు. అనంతరం సీఐఏ అధ్యక్షుడు గోవింద్రెడ్డి, ఐలా చైర్మన్ జక్కా రోషిరెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు వెంకటరత్నం, చంద్రశేఖర్రెడ్డి, ఎస్ఆర్సీ రెడ్డి, వినోద్కుమార్, గంగాధర్బాబు, దత్తు, సురేశ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.