సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి (ఎంబీబీఎస్) నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దోర్బల కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా ఘణపురం రాంప్రసాదశర్మ, కోశాధికారిగా యలమంచి రామకృష్ణ శర్మ, సమన్వయ కర్తగా మహాదేవబట్ల లక్ష్మణప్రసాదశర్మ, ఉపాధ్యక్షులుగా వడ్గిచర్ల విష్ణుమూర్తిశర్మ, జోషి రమేశ్, మహాదేవబట్ల దిలీప్కుమార్శర్మ, సీహెచ్ భవాని, సంయుక్త కార్యదర్శులుగా జ్యోషి సత్యనారాయణ, రాజనాల వెంకటేశ్వరశర్మ, యలమంచి చంద్రశేఖరశర్మ, త్రివేణి, కార్యనిర్వాహక కార్యదర్శిగా సిరిసిల్ల రామశర్మ, వైదిక కార్యదర్శులు కొడకండ్ల రాధాకృష్ణశర్మ, కూచివంశీ, కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా మధునూరి మహాదేవశర్మ, విఠాల మురళీధరశర్మ, శ్రవణ్ కుమారాచార్యులు, గోళ్ల గోవర్ధన్శర్మ, ఎన్.చంద్రశేఖరశర్మ, ముఖ్యసలహాదారులు నెమ్మాని విష్ణుమూర్తిశర్మ, డాక్టర్ తుమ్మూరి లక్ష్మణరావు, దామెర సత్యనారాయణశర్మ, యలమంచి విఠలేశ్వరశర్మలను ఎన్నుకున్నట్లు ఓ ప్రకటనలో కమిటీ తెలిపింది.