సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): నగరంలోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లోని రాజీవ్ స్వగృహ ప్లాట్లను కేటాయించేందుకు డ్రాను మంగళవారం నిర్వహించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహించారు. ఈనెల 7వ తేదీ వరకు ఉన్న గడువు లోగా 1393 మంది టోకెన్ అడ్వాన్స్ చెల్లించగా, వారికి మంగళవారం నిర్వహించిన డ్రాలో 923 మందికి ప్లాట్లను కేటాయించామని అధికారులు తెలిపారు. డ్రాకు సంబంధించిన వీడియో లైవ్ ఫుటేజీని ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా మాద్యమాల్లో ప్రసారం చేశామని, డ్రాలో ఎంపికైన వారి వివరాలను హెచ్ఎండీఏ వెబ్సైట్, స్వగృహ వెబ్సైట్లలో ఉంచుతామని అధికారులు తెలిపారు.