తెలుగుయూనివర్సిటీ, నవంబర్ 7 : తెలుగు పత్రికారంగంలో విలువలను, ప్రమాణాలను పాటిస్తూ జర్నలిస్టులకు ఆదర్శ గురువుగా వరదాచారి నిలిచారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కొనియాడారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్టు గోవర్ధన సుందర వరదాచారి సంతాప సభను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలుగు జర్నలిజంలో వరదాచారి కర్మయోగిగా నిలిచారని అభివర్ణించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య టి.
కిషన్రావు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల క్రితం పాత్రికేయ రంగంలో వచ్చిన వరదాచారి అద్వితీయ ప్రతిభాసంపన్నుడుగా నిలిచారని అన్నారు. ప్రముఖ పాత్రికేయులు గోవిందరాజు చక్రధర్ మాట్లాడుతూ జర్నలిజంలో బహుముఖీనమైన అనుభవాన్ని సంపాదించిన వరదాచారి ఉత్తమ పాత్రికేయులని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య వి. సత్తిరెడ్డి, ఆచార్య కె.సుధీర్ కుమార్, సీనియర్ పాత్రికేయులు యం.నాగేశ్వరరావు, ఆర్వీ రామారావు, కే.రామచంద్రమూర్తి, వల్లీశ్వర్, శంకరనారాయణ, వెంకటేశ్వర్లు, ఆచార్య రెడ్డి శ్యామల, వరదా చారి కుమారులు శ్రీవర్ష గోవర్ధన్, శ్రీహర్ష, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.