ఎల్బీనగర్, అక్టోబర్ 26: విదేశాల్లో మాదిరిగా నగరంలో అంతర్జాతీయ స్థాయిలో ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం చేసి ట్రాఫిక్ ఇబ్బందుల లేకుండా చేసిన ఘనత మంత్రి కేటీఆర్దేనని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి కొనియాడారు. బుధవారం నాగోలులో రూ.143 కోట్ల తో నిర్మించిన ఫ్లై ఓవర్ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ కూడలి ఐదేళ్ల క్రితం ఉన్న పరిస్థితికి నేటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో జాతీయ రహదారిపై, ఇన్నర్ రింగ్రోడ్డులో ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం నిర్మించిన ఫ్లై ఓవర్లు, అండర్పాస్లతో ప్రజలకు ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణం అందుబాటులోకి వచ్చిందన్నారు. మంత్రి కేటీఆర్ ట్రాఫిక్ చిక్కులను అధిగమించేందుకు చేసిన ప్రణాళికలో భాగంగానే ఎస్ఆర్డీపీ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయన్నారు. అన్ని మౌలిక సదుపాయాలను హైదరాబాద్కు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్దేనన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఎస్ఆర్డీపీ పనులతో పాటుగా గతంలో కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురవుతున్న ప్రాంతాల సమస్యలను తొలగించేందుకు రూ.113 కోట్ల సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం కింద పనులను చేపడుతున్నారని అన్నా రు. ఆటోనగర్లో డంపింగ్ యార్డు ప్రాంతంలో అద్భుతమైన పూల వనం, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రేవ్యార్డు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బస్ టర్మినల్, ఎల్బీనగర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆక్సిజన్ పార్కులను కూడా మంత్రి కేటీఆర్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నో దశాబ్దాలుగా మూలుగుతున్న రిజిస్ట్రేషన్ల సమస్యలకు మంత్రి కేటీఆర్ పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కోరారు. గతంలో మన నగరం కార్యక్రమంలో భాగంగా ఈ సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో మాట్లాడి, చర్చించడంతో ఈ సమస్యల చివరిదశలో ఉందన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ ప్రజలకు శుభవార్త తెలుపాలని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్త, కాటేపల్లి జనార్ధన్రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కార్పొరేటర్లు ఎన్.పవన్కుమార్, చింతల అరుణా సురేందర్యాదవ్, సుజాత నాయక్, ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జీ రామ్మోహన్గౌడ్, మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాష్గౌడ్, విఠల్రెడ్డి, సాగర్రెడ్డి, సంగీత ప్రశాంత్గౌడ్, శ్రీనివాస్రావు, జిట్టా రాజశేఖర్రెడ్డి, ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న, పద్మా నాయక్, సామ తిరుమల్రెడ్డి, ప్రవీణ్కుమార్, సామ రమణారెడ్డి, జిన్నారం విఠల్రెడ్డి, డివిజన్ల అధ్యక్షులు అరవింద్రెడ్డి, రాహుల్గౌడ్, శ్రీధర్ గౌడ్, చిరంజీవి, జక్కల శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు రాజారెడ్డి, కుంట్లూరు వెంకటేశ్ గౌడ్, నరేశ్, సుర్వి రాజు, సతీశ్యాదవ్, సురేందర్రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్రెడ్డితో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు.