శామీర్పేట, అక్టోబర్ 13 : రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ యూనియన్ అధికారిక అభ్యర్థిని గెలిపించాలని సంఘం పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి కోరారు. ఆయన మూడుచింతపల్లి మండలంలో ఉన్న వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం పర్యటించారు. ఫామ్ నంబరు 19 ఇచ్చి, ఓటరుగా నమోదు చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే సంఘం పీఆర్టీయూ అన్నా రు. పదోన్నతులు, బదిలీలు ఇప్పించే బాధ్యత తమ సంఘానిదన్నారు.
ఉపాధ్యాయుల సంక్షమమే ప్రధాన ఎజెండా అసెంబ్లీలో వాణి వినిపించే వ్యక్తులను గెలిపించాలన్నారు. అర్హత గల ఉపాధ్యాయులందరూ ఓటు హక్కును వినియోగించుకుని, సంఘం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఎవరూ కూడా ఎన్నికలకు దూరంగా ఉండకుండా సరియైన అభ్యర్థిని ఎన్నుకోవాలన్నారు. పీఆర్టీయూ అధికార అభ్యర్థిగా గుర్రం గుర్తుపై చెన్న కేశవరెడ్డి పోటీ చేస్తున్నారని తెలిపారు. ఆయన గెలిపించుకునే బాధ్యత సంఘం సభ్యులందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు రామేశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, మండల బాధ్యులు మల్లికార్జున్, బాలశౌరెడ్డి, ఆనంద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.