ఖైరతాబాద్, అక్టోబర్ 2 : సోమాజిగూడ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురారాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరై స్వయంగా బతుకమ్మను పేర్చి….పసుపుతో గౌరమ్మ తయారు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, మహిళా జర్నలిస్టులతో కలిసి గౌరమ్మను కొలుస్తూ బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడారు. కార్యక్రమంలో ప్రెస్క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్. వేణుగోపాల నాయుడు, ఆర్. రవికాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు సి. వనజ, కె. శ్రీకాంత్ రావు, సహాయ కార్యదర్శులు హరిప్రసాద్, కోశాధికారి ఎ. రాజేశ్, కార్యవర్గ సభ్యులు ఎ. పద్మావతి, రమాదేవి, ఎన్. ఉమాదేవి, శ్రీనివాస్, బి. గోపరాజు, వి.బాపురావు, ఎం. రాఘవేందర్ రెడ్డి, పి. అనిల్ కుమార్, శ్రీనివాస్,జి. వసంత్ కుమార్ పాల్గొన్నారు. అంతకుముందు అతిథులకు కోలాటాలు, బంజారా నృత్యాలు, డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు.
బల్కంపేట ఎలమ్మ, ఉజ్జయినీ మహంకాళీ ఆలయంలో ఎమ్మెల్సీ పూజలు
బేగంపేట్/అమీర్పేట్, అక్టోబర్ 2: బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో సీఎం కేసీఆర్ సతీమణి, ఎమ్మెల్సీ కవిత,మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో ఆదివారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా ఆలయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని సతీమణి సువర్ణ, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, మహిళల పెద్ద ఎత్తన పాలొగనారు. కలిసి బతుకమ్మ ఆడారు.
10 లక్షల బతుకమ్మ చీరలు
సిటీబ్యూరో, అక్టోబరు 2 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సోమవారంతో ముగియనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లతో పాటు కంటోన్మెంట్లో శనివారం నాటి వరకు సుమారు 10 లక్షల చీరలను పంపిణీ చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. నగరంలో 914 కేంద్రాలలో పంపిణీ జరిగినట్లు పేర్కొన్నారు.