సిటీబ్యూరో, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ) : శ్రీలంక దేశాన్ని సందర్శించండి.. పర్యాటక రంగాన్ని ఆస్వాదించాలని హైదరాబాదీలకు శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో పిలుపునిచ్చారు. హైదరాబాద్ తరహాలో తమ దేశంలోనూ పర్యాటక ప్రాంతాలను పర్యటించాలని కోరారు. హైదరాబాద్లోని తాజ్ కృష్ణా హోటల్లో జరిగిన శ్రీలంక టూరిజం శాఖ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించిందని, ఇందులో భాగంగా ఇండియాతో ద్వైపాక్షిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి శ్రీలంక టూరిజం శాఖ పలు కార్యక్రమాలు కృషి చేస్తుందన్నారు.
2023లో ఈ సంఖ్య రెట్టింపు కానుందని ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు పలు నగరాల్లో రోడ్షోలు నిర్వంచిందని, శ్రీలంక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కొవిడ్ మహమ్మారి, ఆర్థిక సంక్షోభం సమయంలో తమ దేశానికి ఇండియా అండగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీలంక ప్రతినిధులను కలిసి పుష్పగుచ్ఛాన్నిచ్చారు. టూరిజం ప్రమోషన్ బ్యూరో చైర్మన్ చలక జగబాహు, కన్వెన్షన్ బ్యూరో చైర్మన్ జయసూర్య, శ్రీలంకన్ ఎయిర్ లైన్స్, మాస్టర్ కార్డు ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా ఇప్పటివరకు ఇండియా నుంచి 80వేల మంది శ్రీలంకను సందర్శించారు.