ఉప్పల్/రామంతాపూర్/చర్లపల్లి/మల్లాపూర్, సెప్టెంబర్ 30: దేవీ శరన్నవరాత్రిఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉప్పల్లోని వెలుగుగుట్ట ఆలయం, మహంకాళి ఆలయం, నాచారంలోని మహంకాళి ఆలయం, చిలుకానగర్లోని ఆలయాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రామంతాపూర్, మల్లాపూర్, చర్లపల్లి ప్రాంతాలలో భక్తులకు ప్రత్యేక అలంకరణ దర్శనం కల్పిస్తున్నారు.
నాచారంలోని మహంకాళి ఆలయంలో నవరాత్రి పూజ కార్యక్రమాలకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాచారం కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, నేతలు జనంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, సాయిజెన్ శేఖర్, లేతాకుల రఘుపతిరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మేకల ముత్యంరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొరేపాక అంజి, పోగుల వెంకటరమణారెడ్డి, కాటేపల్లి రవీందర్రెడ్డి, ఎర్రం శ్రీనివాస్రెడ్డి, తుంగ తిరుపతి, విఠల్యాదవ్, దేవులపల్లి యాదగిరి, ప్రీతిరెడ్డి, శ్రీలత, సుగుణ పాల్గొన్నారు.
రామంతాపూర్లోని పలు అమ్మవారి దేవాలయా ల్లో అమ్మవారి నవరాత్రులు కన్నుల పండుగగా సాగుతున్నాయి. 5 వరోజు గోఖలేనగర్ ఊర పోచమ్మ దేవాలయంలో అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అదేవిధంగా కట్టమైసమ్మ అమ్మవారిని లలితా దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం ఉదయం అమ్మవారికి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీనగర్ కాలనీలో అమ్మవారి మండపం వద్ద మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇందిరానగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, లేతాకుల రఘుపతిరెడ్డి, సూరంశంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్ డివిజన్ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి. శ్రీనివాస్రెడ్డి మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ వెంకటేశ్వరనగర్కాలనీలోని షిరి డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
మల్లాపూర్ డివిజన్ పరిధిలోని శాంతి యూత్ క్లబ్, నవజ్యోతి యూత్ క్లబ్, నెహ్రునగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల వద్ద పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను కార్పొరేటర్లు దేవేందర్రెడ్డి, ప్రభుదాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ శివకుమార్, కుంటి కృష్ణ, పీఆర్. ప్రవీణ్, నాగారం బాబు, రాంపల్లి మల్లేష్గౌడ్, దుర్గయ్య, రంగు ప్రసాద్గౌడ్, రమణ పాల్గొన్నారు.