సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ):మెట్రో రైలు ఓ ప్రాణం నిలిపేందుకు చేయూతనిచ్చింది. గ్రీన్చానల్ ద్వారా హృదయాన్ని పదిలంగా గమ్యస్థానానికి చేర్చింది. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు మెట్రో రైలులో నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు (21 కిలోమీటర్లు) 25 నిమిషాల్లో గుండెను తరలించారు. ఓ వైపు టీ20 మ్యాచ్ ముగించుకొని ఇండ్లకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు బారులు తీరి ఉన్నా.. ఎలాంటి అవాంతరాలు లేకుండా హెచ్ఎంఆర్ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో ఎల్బీనగర్ కామినేని దవాఖాన నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి గుండెను చేర్చేందుకు మెట్రో రైలు వారధిగా నిలిచింది.
సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): గుండెను తరలించేందుకు మెట్రో సంస్థ మరోసారి గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసింది. అర్ధరాత్రి ఒంటి గంటకు నాగోల్ నుంచి జూబ్లీ చెక్పోస్టు మెట్రో స్టేషన్ వరకు 25 నిమిషాల్లోనే గుండెను తరలించి మరో ప్రాణం నిలిపేందుకు చేయూతనిచ్చింది. ఓవైపు టీ20 మ్యాచ్ ముగించుకొని ఇండ్లకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున్న మెట్రో స్టేషన్ల వద్ద నగర వాసులు బారులు తీరి ఉంటే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా గతంలో కంటే ఒక్క నిమిషం ముందుగానే గమ్యస్థానానికి చేర్చేందుకు మెట్రో సన్నాహాలు చేసింది.
అవాంతరాలు లేకుండా..
ఎల్బీనగర్లోని కామినేని దవాఖాన డాక్టర్లు, ఇతర మెడికోలు అర్ధరాత్రి ఒంటి గంటకు నాగోల్లోని మెట్రో స్టేషన్కు గుండెను తీసుకొని బయలు దేరారు. అప్పటికే లైన్-3 సెక్యూరిటీ అధికారులతోపాటు మెట్రో అధికారులు ప్రయాణానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. సాధారణంగా నాగోల్ నుంచి 21కిలో మీటర్ల దూరంలో ఉన్న జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు 17 స్టేషన్లను దాటుకొని ప్రయాణించాలంటే 38 నిమిషాల సమయం పడుతుంది. కానీ గ్రీన్ చానెల్ ద్వారా ఏకంగా 25 నిమిషాల వ్యవధిలోనే గమ్యస్థానానికి చేర్చారు. గతేడాది ఫిబ్రవరి నెలలో నిర్వహించిన గ్రీన్ చానెల్ కంటే ఒక్క నిమిషం ముందుగానే వైద్య సిబ్బంది జూబ్లీహిల్స్ అపోలో దవాఖానకు చేరుకున్నారని మెట్రో సిబ్బంది తెలిపారు.