అబిడ్స్, సెప్టెంబర్ 26 : సమగరా జాతి సంఘ్ కులస్తులకు ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామని మంత్రి గుంగుల కమలాకర్ అన్నారు. టీఆర్ఎస్ నాయకుడు ఎం.ఆనంద్కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ఆ సంఘం ప్రతినిధులు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిఫారసు పత్రాన్ని ఆయనకు అందజేశారు. నగరంలో సుమారు 50వేల జనాభా ఉన్న సమగరా జాతి సంఘ్ కులస్తులకు ఆత్మగౌరవ భవనం కోసం స్థలం కేటాయించి భవన నిర్మాణానికి చొరవ చూపాలని కోరారు. త్వరలోనే పనులు చేపడుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధులు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్కు కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగరా జాతి సంఘం అధ్యక్షుడు జానక్రామ్, ప్రధాన కార్యదర్శి ఎం.మహేంద్రకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.కృష్ణ, వైస్ ప్రెసిడెంట్లు జి.ప్రకాశ్, బీసీ ధన్రాజ్, కార్యదర్శులు ఎ.రాజేశ్, టి.భారత్ భూషన్, కె.రాజేశ్, సి.రాంచరణ్, కె.దుర్గారాజ్, ఆర్.శివచరణ్, జాంబాగ్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి జి.నందుకుమార్, తదితరులు పాల్గొన్నారు.