ఖైరతాబాద్, సెప్టెంబర్ 25: బీసీలు బలహీనవర్గాలు కాదు….బలమైన వర్గాలని రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. మహాత్మాపూలే ఫౌండేషన్ ట్రస్ట్, బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సామాజిక విప్లవకారిణి చాకలి(చిట్యాల)ఐలమ్మ జయంతోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. అనంతరం పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురు మహిళలకు ఆత్మీయ సతారంతో పాటు అవార్డులను చెంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ ఎన్. శివకుమార్ గౌడ్, ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్, ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి, వ్యవస్థాపక అధ్యక్షుడు సూర్యారావుతో కలిసి అందజేశారు. ఈ సభలో వివిధ సంఘాల ప్రతినిధులు దాసు సురేశ్, ఉప్పలయ్య, సతీశ్సాగర్,డాక్టర్ శంకర్ ముదిరాజ్, సంధ్యా రాణి, వరలక్ష్మి,మాధవి పాల్గొన్నారు.
బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాసరావు
సుల్తాన్బజార్,సెప్టెంబర్ 25: బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సుంకర శ్రీనివాస రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ మేరకు ఆదివారం బొగ్గులకుంట హనుమాన్టేక్డీలోని బీసీ సాధికారత భవన్లో బీసీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.బీసీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా సుంకర శ్రీనివాస రావు,ప్రధాన కార్యదర్శిగా పసుపులేటి నరేంద్ర స్వామి,ముఖ్య సలహారులుగా తాళ్ళపల్లి సురేశ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు.అనంరతం సంఘం నూతనంగా ఎన్నికైన వారిని శాలువాతో సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు.ఈ సమావేశంలో బీసీ సంఘం సీనియర్ నాయకులు రామరాజు,కాశయ్య గౌడ్,బీసీటీయూ జిల్లాల అధ్యక్షులు వినోద్ కుమార్,శంకర్ గౌడ్,గోపాలకృష్ణ,బీరప్ప,శ్రీనివాస్,ప్రొఫెసర్ లింగం,శంకర్ ముదిరాజ్,మణి మంజరి,లింగం,బీసీ యువజన సంఘం నాయకులు రాజు గౌడ్,మధు,బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి సాయితేజ, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.