ఖైరతాబాద్, సెప్టెంబర్ 24: రాష్ట్రంలోని మాదిగలకు జనాభా ప్రాతిపదికన 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ మింట్కాంపౌండ్లోని అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలోఆయన మాట్లాడుతూ దళిత జనాభా సర్వే చేయాలని, తెలంగాణలో ఒక యూనివర్సిటీ వీసీగా మాదిగలకు అవకాశం ఇవ్వాలని అన్నారు. మాదిగ,మాల, ఉప కులాలుగా ఎస్సీ కార్పొరేషన్ను విభజించాలన్నారు.
టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ మాట్లాడుతూ అక్టోబర్ 23న రాష్ట్రంలోని మాదిగ సంఘాల ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ కలయిక మాదిగల అలైబలై కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో ఎంహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్, తెలంగాణ మాదిగ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున్, ఎన్డీఎస్ఎస్ జాతీయ ఉపాధ్యక్షులు బాబురావు, మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వీరేందర్, ఏపీ, తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ అంజి, బీఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులు సురేశ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సాయన్న, శ్రీరామ్, ప్రసాద్, మహేశ్, గోపి, విజయ్, గణేశ్, మహేశ్, సాంబశివుడు, రాంబాబు, ప్రకాశ్ పాల్గొన్నారు.