సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బతుకమ్మ పండుగకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం టీఆర్ఎస్కేవీ రూపొందించిన బతుకమ్మ పోస్టర్ను కవిత నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఆడపడచులకు శుభాకాంక్షలు తెలిపినట్లు టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, ప్రధాన కార్యదర్శి సాగర్ల బాలరాజ్యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్, సూల్ వ్యాన్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ సాయి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బచ్చల శ్రీనివాస్, అబ్దుల్ జబ్బర్, షేక్ రఫీక్, షేక్ నబి, ఓట్ల యాదగిరి, మర్రి భాసర్, నరేశ్, స్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు.