ఎల్బీనగర్, సెప్టెంబర్ 25: ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బోనాంజా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దిల్సుఖ్నగర్లోని రామయ్య కోచింగ్ సెంటర్లో లక్కీ డ్రా తీశారు. కోచింగ్ సెంటర్ చైర్మన్ సిరికొండ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ సిరికొండ సునీత, ‘నమస్తే తెలంగాణ’ అడ్వర్టయిజింగ్ ఏజీఎంలు రాజిరెడ్డి, రామకృష్ణయాదవ్, మేనేజర్ సురేందర్రెడ్డి లక్కీ డ్రా తీసి.. ఐదుగురు విజేతలను ఎంపిక చేశారు. మొదటి బహుమతి యాప్రాల్ బాలాజీనగర్కు చెందిన జి. కేశవి గెలుచుకోగా, రెండో బహుమతి ప్రశాంతి, మూడో బహుమతి ఎస్. శేఖర్, నాలుగో బహుమతి జె. వెంకన్న, ఐదో బహుమతి ఎన్. మోహన్రావు గెలుపొందారు. కార్యక్రమంలో రామయ్య కోచింగ్ సెంటర్ అధ్యాపకులు మధుబాబు, హరికృష్ణ, రమేశ్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
నమస్తేతో మాకు ఆత్మీయ అనుబంధం
‘నమస్తే తెలంగాణ’తో మా రామయ్య కోచింగ్ సెంటర్కు ఎన్నో ఏండ్ల అనుబంధం ఉంది. తెలంగాణలో నంబర్వన్ పత్రికగా ‘నమస్తే తెలంగాణ’ నిలిస్తే, తెలంగాణలో నంబర్వన్గా రామయ్య కోచింగ్ సెంటర్ గుర్తింపు పొందింది. ఉత్తమ శిక్షణ ఇచ్చి ఉద్యోగులుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ దసరా బోనాంజాలో మేం భాగస్వాములవ్వడం సంతోషంగా ఉంది.
– సిరికొండ లక్ష్మీనారాయణ, చైర్మన్ రామయ్య కోచింగ్ సెంటర్
ఆనందంగా ఉంది
‘నమస్తే తెలంగాణ’ దసరా బోనాంజాలో భాగం కావడం ఆనందంగా ఉంది. ఉత్తమ శిక్షణ ఇస్తూ, విద్యార్థులను అన్ని రంగాల్లో నంబర్వన్గా తీర్చిదిద్దుతున్నాం. మా విద్యార్థులకు బోనాంజాలో బహుమతులు దక్కడం సంతోషంగా ఉంది. అందరూ దసరా బోనాంజాను సద్వినియోగం చేసుకోవాలి.
– సిరికొండ సునీత, డైరెక్టర్,రామయ్య కోచింగ్ సెంటర్
ఆశ్చర్యపోయా
దసరా బోనాంజాలో బహుమతి రావడం ఆనందంగా ఉంది. కేఎల్ఎం మాల్లో షాపింగ్ చేశాను. బహుమతి వచ్చిందని సమాచారం ఇవ్వగానే ఆశ్చర్యపోయాను.
– జి. కేశవి, మొదటి బహుమతి విజేత
ప్రజల గుండె చప్పుడు ‘నమస్తే’
‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ దసరా బోనాంజాకు మంచి స్పందన వస్తున్నది. పత్రికను చదివి అందులో పేర్కొన్న సంస్థల్లో షాపింగ్ చేసి.. ప్రతిరోజు నిర్వహించే లక్కీ డ్రాలో బహుమతులు గెలవండి. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.
-రామకృష్ణ యాదవ్, ఏజీఎం, ‘నమస్తే తెలంగాణ’, అడ్వర్టయిజింగ్ విభాగం
మంచి శిక్షణ
రామయ్య కోచింగ్ సెంటర్లో మంచి శిక్షణతో పాటు ఇచ్చే గైడెన్స్ ఎంతో బాగుంది. ఇక్కడ శిక్షణ పొందిన వారు పలు విభాగాల్లో ఉద్యోగాలు పొందారు. ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ దసరా బోనాంజాలో మాకు భాగం కల్పించడం సంతోషంగా ఉంది.
– శేఖర్, వెంకన్న, రామయ్య కోచింగ్ సెంటర్ విద్యార్థులు