మియాపూర్, సెప్టెంబరు 21 : తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులను చీర సారెతో సీఎం కేసీఆర్ పెద్దన్నలా గౌరవిస్తున్నారని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఈ ప్రత్యేక గౌరవం అందుకుంటున్నది తెలంగాణ ఆడపడుచులేనన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ శంషీగూడలో, హైదర్నగర్ డివిజన్లోని నందమూరి నగర్, రామ్నరేశ్నగర్లలో మహిళలకు బతుకమ్మ చీరెలను కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీనివాసరావులతో కలిసి గాంధీ బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ అద్దం పడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతతో బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తం అయిందని ఆయన తెలిపారు. మహిళలకు పండుగ సందర్భంగా చీరెలను అందివ్వటమే కాకుండా వీటి తయారీపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించిందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మహిళల తరఫున ప్రభుత్వానికి విప్ గాంధీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రంగారావు, సమ్మారెడ్డి, దామోదర్రెడ్డి అనీల్రెడ్డి, గణేశ్, పోతుల రాజేందర్, కుమారస్వామి, శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్, కాశీనాథ్, రామకృష్ణ గౌడ్, రాములు, వాసు, యాదగిరి, సత్తార్, బాలయ్య, వెంకట్రావు, ఇమ్రాన్, కృష్ణ, సుధాకర్రెడ్డి, కృష్ణకుమారి, మాధవి, విమల, హైమద్ఉన్నీసా, సిబ్బంది తదితరులు