ఉప్పల్, సెప్టెంబర్ 15 : నులిపురుగుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే బేతి సుభా ష్రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఉప్పల్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులను వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి నులిపురుగుల నివారణ మందు వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
సమాజంలో అంటువ్యాధులను నివా రించడంతోపాటు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్ రజితా పరమేశ్వర్రెడ్డి , డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సరస్వతి, డా.రాఘునాథ్స్వామి, డా.నారాయణరావు, డాక్టర్ సౌందర్యలత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రెడ్డి, నేతలు లేతాకుల రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.
చిలుకానగర్ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులి పురుగుల నివారణ మందులు వేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్, కా ర్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ హాజర య్యా రు. విద్యార్థుల శారీరక, మానసిక ఎదు గుదలకు ఆటం కం కలిగించే నులిపురుగుల నివారణకు మందులు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి సౌందర్యలత, సూపర్ వైజర్ ప్రకాశ్, నేతలు బన్నాల ప్రవీణ్, కొండల్రెడ్డి, జగన్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.