అంబర్పేట, సెప్టెంబర్ 8 : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మె ల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ రామకృష్ణనగర్ పార్కు ఆవరణలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది నాలుగు ఈఎఫ్ఏల బృందాలకు సర్కిల్ డీసీ వేణుగోపాల్తో కలిసి ఆయన హెల్త్కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు వస్తున్నాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం ఇంటింటికీ జ్వర సర్వేను నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ సర్వేలో ఎక్కడైనా డెంగీ కేసులు నమోదైతే ఆ ఇంటి చుట్టు పక్కల వంద మీటర్ల వరకు అందరినీ అప్రమత్తం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో జీహెచ్ఎంసీ, వైద్య, ఆరోగ్య సిబ్బంది జ్వర సర్వేను చేపట్టారని తెలిపారు. ఎంటమాలజీ సిబ్బంది కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వారికి హెల్త్ కిట్ల ను అందజేస్తున్నామని చెప్పారు. ఇందులో శానిటిటైజర్లతో పాటు రెయిన్ కోటు, సబ్బులు, నూనెలు తదితర వస్తువులను జీహెచ్ఎంసీ అందిస్తున్నదని పేర్కొన్నారు. ఎంటమాలజీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి దోమల నివారణ పట్ల ప్రజలకు అవగాహన కలిపించాని చెప్పారు. ఛీప్ ఎంటమాలజిస్ట్ డా.రాంబాబు, ఏఈ అం బిక, ఈఎఫ్ఏలు రాఘవేందర్, వెంకటయ్య, కిషన్నాయక్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, అఫ్రోజ్పటేల్, శివాజీయాదవ్, రమేశ్నాయక్, మిర్యాల రవీందర్, నవీన్యాదవ్, దారయోబు, బొట్టు శ్రీను, శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గణేశ్ ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్లోని అన్ని బస్తీలు, కాలనీల్లో ఏర్పాటు చేసిన 30 వినాయక మండపాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శుక్రవారం జరిగే వినాయక నిమజ్జనాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పా రు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చంద్రమోహన్, శ్రీరాములుముదిరాజ్, ఎర్రబోలు నర్సింహారెడ్డి, రమేశ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.