సైదాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం మంజూరుచేసిన ఆసరా పించన్ల కార్డులను తీసుకునేందుకు వెళ్లిన తమను సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ భర్త, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కొత్త కాపు రవీందర్ రెడ్డి, అతని అనుచరులు ఇంటి నుంచి వెళ్లగొట్టారని మహిళలు ఆరోపించారు. సైదాబాద్ పూసల బస్తీ సంఘం కార్యాలయం వద్ద మీడియాతో మహిళలు మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం కార్పొరేటర్ కొత్తకాపు అరుణ తన నివాసం వద్ద సైదాబాద్ మండల రెవెన్యూ అధికారులతో కలిసి ఆసరా పింఛన్ల లబ్ధిదారుల కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తమ కార్డులను తీసుకోవటానికి పూస ల బస్తీకి చెందిన అనేక మంది మహిళలు, వృద్ధులు కార్డుల కోసం రెడ్డి బస్తీలోని కార్పొరేటర్ ఇంటికి వెళ్లా రు. అయితే, ఇంటికి వెళ్లిన మహిళలు, వృద్ధుల పట్ల కార్పొరేటర్ భర్త కొత్తకాపు రవీందర్రెడ్డి, అతని అనుచరులు తమ ఇంటి వద్దకు రావొద్దంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటమే కాకుండా అసహ్యించుకుం టూ, అసహనంతో మాట్లాడారని ఆరోపించారు.
తాము వేసిన ఓట్లుతో కార్పొరేటర్గా గెలిచిన వారు తమ తో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించటమే కాకుండా తమకు సరైన సమాధానం చెప్పకుండా తిప్పి పంపిం చి వేశారని వారు ఆరోపించారు. మహిళలు, వృద్ధుల పట్ల కార్పొరేటర్ భర్త వ్యవహార శైలి పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి వద్దకు వచ్చిన మహిళలను కనీసం కార్పొరేటర్ అరుణ పట్టించుకోలేదని, ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఆసరా పింఛన్ కా ర్డులను తమ పూసల సంఘం కమ్యూనిటీ హాల్ వద్దనే ఇవ్వాలని, ఓట్ల సమయంలో తమ ఇండ్ల వద్దకు వచ్చి ఓట్లు వేయించుకున్న కార్పొరేటర్ ఇప్పుడు తన ఇంటి చుట్టూ తిప్పించుకుంటున్నారని నిలదీశారు.
అధికారులు ఉన్నారు.. మళ్లీ రమ్మని చెప్పా..
పోలీసు అధికారులు తమ ఇంటికి రావటంతో మళ్లీ వచ్చి కార్డులను తీసుకోవాలని చెప్పాను. ఎవ్వరినీ ఇంటి నుంచి వెళ్లగొట్టలేదు. మహిళల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించలేదు. కొంత మంది నాపై ఉద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా నేను ఎవ్వరినీ నొప్పించే విధంగా మాట్లాడలేదు.
– కొత్తకాపు రవీందర్ రెడ్డి(కార్పొరేటర్ భర్త, బీజేపీ సీనియర్ నేత)